'గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలి'
MNCL: గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని విశ్వహిందూ పరిషత్ గో వంశ రక్షణ సంవర్ధన సమితి రాష్ట్ర సంపర్క ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి కోరారు. లక్షిట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో రెండు మండలాల సమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. అనంతరం రెండు మండలాల గోరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ నగర అధ్యక్షులు రమేష్ ఉన్నారు.