'రైతులు భూసార పరీక్షలు చేయించాలి'

'రైతులు భూసార పరీక్షలు చేయించాలి'

AKP: రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని ఎస్. రాయవరం మండలం టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం సూచించారు. సైతారుపేటలో ఏఓలు సౌజన్య, విజేత ఆధ్వర్యంలో ఇవాళ భూసార పరీక్షలు వాటి ఉపయోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త శిరీష మాట్లాడుతూ రైతులు మట్టి నమూనాలను వారి పొలాల నుంచి సేకరించి భూసార పరీక్షలు నిర్వహించాలన్నారు.