రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ATP: పుట్లూరు మండలం శనగలగూడూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంగన్నపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి మృతి చెందాడు. బైక్పై స్టీల్ ప్లాంట్కు వెళ్తుండగా ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.