రాఘవేంద్రస్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

రాఘవేంద్రస్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్ నెల 22 రోజులకు సంబంధించిన భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,25,96,854 ఆదాయం వచ్చినట్లు మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. వీటితో పాటు భక్తులు 47 గ్రాముల బంగారం, 592 గ్రాముల వెండిని సమర్పించినట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులలో జమ చేసినట్లు పేర్కొన్నారు.