ప్రజా సమస్యలను పరిష్కరిస్తా: మంత్రి బీసీ
NDL: బనగానపల్లె ప్రజా దర్బార్లో శనివారం మంత్రి BC జనార్దన్ రెడ్డి ప్రజా సమస్యలను సావధానంగా విన్నారు. కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె మండలాల నుంచి అర్జీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతులు అందజేశారు. మంత్రి, అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.