సూళ్లూరుపేట ప్రజలకు గమనిక
TPT: సూళ్లూరుపేటలో ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం 50% వడ్డీ మాఫీ ప్రకటించిందని మునిసిపల్ కమిషనర్ చిన్నయ్య తెలిపారు. ఈ మాఫీ 31 మార్చి 2026 వరకు మాత్రమే అమల్లో ఉంటుందన్నారు. గడువు ముగిసిన తర్వాత పూర్తి వడ్డీ, జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే బకాయిలు చెల్లించాలని సూచించారు.