నౌక హర్మూజ్ దాటాలంటే రూ.18 కోట్లు ఛార్జి..!
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగిస్తోంది. యుద్ధ ఖర్చుల సాకుతో, శత్రుదేశాల నౌకలు మినహా మిగిలిన వాటికి మాత్రమే అనుమతిస్తామని అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో జలసంధి దాటే ఒక్కో నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు(రూ.18కోట్లు) రుసుము వసూలు చేస్తున్నట్లు ఇరాన్ పార్లమెంటు సభ్యుడు బరూజెర్ది వెల్లడించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.