హైవేపై లారీ ఢీకొని వ్యక్తి మృతి
NLR: నాయుడుపేట వద్ద హైవేపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇందుకూరుపేటకు చెందిన రాధాకృష్ణ (42) మృతిచెందారు. నిలిచి ఉన్న వాహనం నుంచి చేపలను మరో వాహనంలోకి మారుస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాధాకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.