ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, భద్రతను మెరుగుపర్చాలని పోలీసులకు సూచించారు. అగ్నిమాపక పరికరాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.