బ్రాహ్మణచెరువులో యూఐపీ కార్యక్రమం
W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామ సచివాలయం వద్ద బుధవారం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 6 నెలల నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు వారి వయసును బట్టి వివిధ రకాల వ్యాధి నిరోధక టీకాలు అందించినట్లు ఏఎన్ఎం లక్ష్మీ తెలిపారు. ఈ కార్యక్రమంలో PHC సిబ్బంది, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.