ఈనెల 21న జాబ్ మేళా
KMR: నిరుద్యోగుల కోసం ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 21వ తేదీన కలెక్టరేట్ ప్రాంగణంలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఇవాళ తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.