ఆన్లైన్ బెట్టింగ్లపై హెచ్చరికలు జారీ
గుంటూరు ఎస్పీ వకుల్ జిందల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్లపై కఠిన హెచ్చరిక జారీ చేశారు. తాత్కాలిక లాభాల మాయలో పడొద్దని, ఇది చట్టవిరుద్ధమని తెలిపారు. 6 నెలల్లో 58 మందిపై 8 కేసులు నమోదు చేసి 31 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. సోషల్ మీడియా, యాప్స్ ద్వారా మోసాలు పెరుగుతున్నందున యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.