MLA చొరవతో సమస్యకు పరిష్కారం
RR: జిల్లేడు చౌదరిగూడ మండలం ఇంద్రానగర్ గ్రామంలో త్రాగునీటి సమస్యపై మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వెంటనే స్పందించారు. ప్రజల అభ్యర్థనతో గ్రామంలో రెండు బోర్లు వేయించి సమస్యకు తక్షణ పరిష్కారం చూపించారు. అధికారంలో లేకపోయినా ప్రజాసేవే లక్ష్యమని మరోసారి నిరూపించారు. గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.