గురుకుల హాస్టల్ ఘటనపై స్పందించిన కవిత

గురుకుల హాస్టల్ ఘటనపై స్పందించిన కవిత

JGL: జగిత్యాల ST సంక్షేమ హాస్టల్ ఘటనపై మాజీ MP కవిత సోషల్ మీడియాలో స్పందించారు. విద్యార్థులపై చీపురుతో దాడి జరగడం అత్యంత దారుణమన్నారు. విద్యా శాఖను తన వద్ద ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వంద మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.