నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 కేవీ రాంనగర్ ఫీడర్ మరమ్మతులు చేపట్టనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. మరమ్మతుల కారణంగా బస్టాండ్ రోడ్, సుభాష్ కాలనీ, రాంనగర్, ఎల్బీ నగర్, లక్ష్మీ నగర్, రెడ్డి కాలని, గాంధీ కళాశాల, బానోత్ వీధి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.