నామమాత్రంగా పాతపట్నం పోలీస్ చెక్ పోస్ట్ యాథావిధిగా రవాణా
SKLM: ఒడిస్సా-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన మహేంద్ర తనియ నది ఒడ్డున పాతపట్నంలో చెక్పోస్ట్ను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇది నామమాత్రంగా ఉండడంతో యథావిధిగా అక్రమ రవాణాలు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరు, ఇద్దరు పోలీసులు ఉండడం, కనీసం వాహనాలకు తనిఖీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రంగా పరిశీలించి, నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.