పశువులు తోలేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు..!

పశువులు తోలేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు..!

JGL: వెల్గటూర్ మండలంలోని కప్పారావుపేట గ్రామ చెరువులో మునిగి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ముక్కట్రావుపేటకు చెందిన అంకతి పెద్ద కోటయ్య(65) మంగళవారం పశువులు మేపేందుకు వెళ్లాడు. చెరువులోకి దిగిన పశువులను తోలేందుకు నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పీ.ఉదయ్ కుమార్ తెలిపారు.