అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ఆదిలాబాద్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆమె స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు తదితరులున్నారు.