గ్రహణం ముగిసిన వెంటనే ఆలయంలో శుద్ధి

గ్రహణం ముగిసిన వెంటనే ఆలయంలో శుద్ధి

అన్నమయ్య: చంద్రగ్రహణం అనంతరం రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని తిరిగి భక్తులకు తెరిచారు. గ్రహణం సమయంలో మూసివేసిన ఆలయాన్ని, గ్రహణం ముగిసిన వెంటనే సంప్రదాయ ప్రకారం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని సిబ్బంది పూర్తిగా శుభ్రం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు.