పేకాట స్థావరంపై దాడి.. నలుగురి అరెస్టు

పేకాట స్థావరంపై దాడి.. నలుగురి అరెస్టు

GNTR: పెదకాకాని మండలం స్వర్ణపురి కాలనీలో శనివారం సాయంత్రం పోలీసులు జూద స్థావరంపై దాడి చేశారు. ఎస్పీ, సీఐ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి కాళీ గార్డెన్స్ సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,990 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.