మరోసారి పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర
మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 100 డాలర్లు పెరిగి 101.19 డాలర్లకు చేరుకుంది. నాలుగేళ్లలో చమురు ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ముడి చమురు ధరలు పెరిగితే భారత్లో పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెరగడమే కాకుండా, రవాణా ఖర్చులు ఖరీదై నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.