రేణు అగర్వాల్ హత్యకేసు వివరాలు వెల్లడించిన సీపీ

TG: కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్యకేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వివరాలను వెల్లడించారు. 'కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్యకేసులో ఇద్దరు నిందితులను జార్ఖండ్లోని రాంచీలో పట్టుకున్నాం. హఫీజ్పేట వద్ద క్యాబ్ తీసుకుని పరారయ్యారు. ఇక్కడి నుంచి పోలీసులు వెళ్లి రాంచీలో నిందితులను పట్టుకున్నారు' అని సీపీ పేర్కొన్నారు.