రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు సహాయం

రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు సహాయం

ప్రకాశం: రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు సహాయం అభినందనీయమని చల్లపల్లి సీఐ కే. ఈశ్వరరావు అన్నారు. గురువారం చల్లపల్లి పడమర వీధి జెండా చెట్టు వద్ధ విశ్రాంత ఉపాధ్యాయుడు అడపా గురవయ్య, అడపా రాంబాబు సహకారంతో నిరుపేద ముస్లింలకు రూ.15 వేలు వ్యయంతో నిత్యావసర సరుకులు అందచేశారు. పఠాన్ కరీముల్లా ఖాన్, పఠాన్ చాన్ ఖాన్, జన్ను అయ్యప్ప, షేక్ కర్ణం, నజీర్ పాల్గొన్నారు.