కొత్త రెవెన్యూ డివిజన్‌గా మడకశిర

కొత్త రెవెన్యూ డివిజన్‌గా మడకశిర

కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పరిపాలనా సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం ఈ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. మడకశిర రెవెన్యూ డివిజన్‌గా మారడం వల్ల ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.