BREAKING: పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు రెండు రోజులుగా తగ్గుతూ వచ్చాయి. అయితే, ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,51,500కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.