'వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ అనుమతి తప్పనిసరి'

'వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ అనుమతి తప్పనిసరి'

KDP: గణేశ్ ఉత్సవాలను సామరస్యంగా, ప్రమాద రహితంగా నిర్వహించుకోవాలని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ప్రజలకు సూచించారు. శనివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉత్సవ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. DJలు, అశ్లీల కార్యక్రమాలు, రాత్రి 10 తర్వాత స్పీకర్లు నిషేధమని ఆమె స్పష్టం చేశారు. నిమజ్జనం ప్రాంతంలో లైటింగ్, ఫైర్, అంబులెన్స్, వాలంటీర్లు అందుబాటులో ఉంటారన్నారు.