జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

MDK: 2027 జనగణన ప్రక్రియను జిల్లాలో అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈసారి జనగణన రెండు దశల్లో జరుగుతుందని.. మొదటి దశలో గృహాల వివరాలు, రెండో దశలో జనాభా వివరాల సేకరణ ఉంటుందని వివరించారు.