పలకలు లేక కాలువ దాటలేక
VZM: రాజాం పట్టణంలోని డోలపేట, పురుషోత్తపురం రెండో లైన్ మార్గంలో ఉన్న కాలువపై పలకలు మరమ్మతుల నిమిత్తం తొలగించిన పురపాలిక సిబ్బంది, వాటిని పూర్తిగా పునరుద్ధరించకుండా వదిలేశారు. ఇటీవల ఒకవైపు కొంతమేర పలకలు అమర్చినా, మిగతా భాగం అలాగే ఉండడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.