గిరిజన సంక్షేమ హాస్టల్స్ వసతులకు నిధులు
PPM: గిరిజన సంక్షేమ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం రూ.113 కోట్లను మంజూరు చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. అమరావతిలో ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల విద్యార్థులుకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.