జిల్లాలో తీవ్రతరం అవుతున్న ఎండలు..!

జిల్లాలో తీవ్రతరం అవుతున్న ఎండలు..!

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. 21 కేంద్రాల్లో నమోదైన వివరాల ప్రకారం మదనపూర్ దగడలో అత్యధికంగా 39 డిగ్రీలు నమోదయ్యాయి. రేమద్దుల, ఆత్మకూరు 38.9, వెలుగొండ, శ్రీరంగాపూర్ 38.8గా నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లో కూడా 38 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలు ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు.