VIDEO: రూ. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ
NTR: విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సంస్థ ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.25–30 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లాభాలు ఇస్తామంటూ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు యజమాని దుర్గాప్రసాద్ను నిలదీశారు. నెలరోజుల క్రితం ఆయన ఆత్మహత్య చేసుకోగా, అనంతరం ఆయన భార్య శివాని అజ్ఞాతంలోకి వెళ్లింది. బాధితులు CP రాజశేఖర్కు ఫిర్యాదు చేశారు.