లాలూ ప్రసాద్ కీలక నిర్ణయం

ఆర్జేజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. ప్రతాప్ వ్యక్తిగత జీవితంలో నెలకొన్న పరిస్థితుల వల్ల పార్టీ పోరాటాన్ని బలహీనపరుస్తున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై తేజ్ ప్రతాప్కు పార్టీలో, తమ కుటుంబంలో స్థానం లేదని తెలిపారు.