పేకాట స్థావరాలపై దాడి.. 15 మంది అరెస్ట్
NLR: కొంతకాలంగా పేకాట ఆడుతున్న 15 మందిని కావలి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. అల్లూరు మండలంలోని ఇస్కపల్లి గ్రామంలో కొందరు కొంతకాలంగా పేకాట స్థావరం ఏర్పాటు చేసుకొని పేకాట ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి దాడులు చేశారు. వారి వద్ద నుంచి 1.50 లక్షలు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు.