హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన
కృష్ణా: మచిలీపట్నం–పెడన జాతీయ రహదారి 216పై ట్రాఫిక్ సీఐ నున్న రాజు హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.హెల్మెట్ ధరించని వాహనదారులకు కేవలం ఫైన్ వేయడమే కాకుండా, వారితో అక్కడికక్కడే హెల్మెట్లను కొనుగోలు చేయించారు.