విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం క్యాంప్ కార్యాలయంలో సోమవారం విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిట్యాల, నార్కెట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా, పెండింగ్ సమస్యలపై చర్చించారు. వినియోగదారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ పాల్గొన్నారు.