యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ సమన్వయ సమావేశం

యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ సమన్వయ సమావేశం

TPT: మార్చి 03 నుంచి 05 వరకు తిరుపతి-తిరుమలలో ఎన్‌ఎస్‌‌జీ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. మార్చి 03న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద, 04-05 తేదీలలో తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో డ్రిల్ జరుగుతుంది. ఇది కేవలం భద్రతా సాధన కార్యక్రమమేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.