ఫెర్టిలైజర్స్, యూరియా దుకాణాలను తనిఖీ చేసిన ఆర్డీవో

SRPT: తుంగతుర్తిలోని పీఏసీఎస్, ఫెర్టిలైజర్స్, యూరియా దుకాణాలను ఆర్డీవో వేణు మాధవరావు మంగళవారం తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా, విత్తనాలను పంపిణీ చేయాలన్నారు. ఎమ్మార్పీ ధరల కంటే అధికరేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆయా దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ దయానందం ఉన్నారు.