గ్రామ సమస్యలపై చర్చా సమావేశం

గ్రామ సమస్యలపై చర్చా సమావేశం

NTR: రామచంద్రాపురం సచివాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం పంచాయతీ ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఎంపీడీవో భవాని గ్రామ సభ సమావేశం నిర్వహించి, గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను చర్చించారు. వాటి పరిష్కారానికి అవసరమైన తీర్మానాలు చేశారు.