ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలవారు, వాగులు, వంకల దగ్గర నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని తెలిపారు.