నేడు సరస్వతి పుష్కరాలకు రానున్న సీఎం

BHPL: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో గురువారం మాధవానంద సరస్వతీ చేతుల మీదుగా తొలి పుష్కర స్నానం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ పుష్కరాల సందర్భంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు నదీ తీరంలో 17 అడుగుల సరస్వతీ ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 5:30 గంటలకు సరస్వతీ హారతి కార్యక్రమంలో పాల్గొంటారు.