రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
W.G: నరసాపురం పాలకొల్లు జాతీయ రహదారి 216పై చిట్టవరం సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. మల్లవరం గ్రామానికి చెందిన రాజేష్ బైక్పై వెళ్తుండగా వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన రాజేష్ను 108 వాహనంలో తొలుత నరసాపురం ఏరియా ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.