'అజరామరమైన కీర్తిని పొందిన మహాకవయిత్రి మొల్లమాంబ'
కోనసీమ: అచ్చ తెలుగులో రామాయణాన్ని రచించి అజరామరమైన కీర్తిని పొందిన మహాకవయిత్రి మొల్లమాంబ ఖ్యాతి తెలుగు భాష ఉన్నంత వరకు నిలిచి ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. శుక్రవారం ఆమె జయంతి సందర్భంగా వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.