VIDEO: శ్రీవారిని దర్శించుకున్న భూమా అఖిలప్రియ

TPT: తిరుమల శ్రీవారిని గురువారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. ఆమెకు అధికారులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా..పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.