VIDEO: ఏవీఎస్వో మృతి చెందిన స్థలాన్ని పరిశీలించిన సీఐడీ చీఫ్
ATP: తాడిపత్రి మండలంలో రైలు పట్టాలపై శవమై తేలిన ఏవీఎస్వో సతీష్ కుమార్ మృతి కేసులో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఇవాళ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోమలి వద్ద ఉన్న రైలు పట్టాలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గుత్తి నుంచి తాడిపత్రి పీఎస్కు బదిలీ అయిన ఈ కేసు వివరాలను అనంతపురం ఎస్పీ జగదీష్ సీఐడీ చీఫ్కు వివరించారు.