బ్లడ్ అసోసియేషన్కు జాతీయ ప్రేరణ పురస్కారం
GNTR: పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్కు ‘మదర్ థెరిస్సా జాతీయ ప్రేరణ పురస్కారం’ లభించింది. వేల మందికి అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో రక్తం అందించినందుకు గాను సంస్థ అధ్యక్షుడు తిరుమలశెట్టి ఉమా శంకర్కు కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.