చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

NLR: కావలి రూరల్ మండలం పెద్ద రాముడు పాలెంకి చెందిన కాటంగారి బ్రహ్మయ్య (34) జువ్వలదిన్నె హార్బర్లో గ్రామస్థులతో కలిసి బోటులో ఆదివారం చేపల వేటకు వెళ్లాడు. తుమ్మలపెంట సమీపంలో చేపలు పడుతూ.. ప్రమాదవశాత్తు బోటులో నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడి భార్య గాయత్రి కావలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేశారు.