కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్
WGL: చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి శనివారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందలేదని విమర్శించారు. ప్రజా పాలనలో గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.