ల్యాండ్ పూలింగ్పై రైతులతో ఎమ్మెల్యే భాష్యం సమావేశం
PLD: అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై పెదమద్దూరు గ్రామ రైతులతో పాటు సీఆర్డీఏ అధికారులతో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు త్వరితగతిన ముందుకు రావాలని పిలుపునిచ్చారు.