జిల్లా ప్రజలకు అలెర్ట్
SKLM: రానున్న రెండు రోజులు జిల్లాలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండి 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనందుకు అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ గురువారం ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లాలో 15 మండలాల్లో తీవ్రవడగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు. వడగాలుల కారణంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.