ఓటు వేయడానికి ముందుకు వస్తున్న వృద్ధులు
MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వృద్ధులు, వికలాంగులు ఆసక్తి చూపుతున్నారు. గురువారం ఉదయం లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట, చెందారం, తదితర గ్రామాలు, దండేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల, ద్వారక తదితర గ్రామాలలో చాలా మంది వృద్ధులు వికలాంగులు ముందుకస్తున్నారు.